అలనాటి నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ కార్తిక వివాహం వేడుకగా జరిగింది. ఆదివారం ఉదయం కేరళలో రోహిత్ మేనన్తో ఆమె ఏడడుగులు వేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు చిరంజీవి – సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి తదితర సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు ఈ పెళ్లి వేడుకకు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2009లో తెరకెక్కిన ‘జోష్’తో కార్తిక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2011లో విడుదలైన ‘రంగం’తో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. 2015 తర్వాత నుంచి సినిమాలకు దూరమయ్యారు కార్తిక.