Monday, May 20, 2024

అయోధ్య రామమందిర ప్రారంభానికి అద్వానీకి అందిన ఆహ్వానం..!!

spot_img

అయోధ్యలోని రామమందిర ప్రారంభానికి బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషికి విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం అందించింది. వీహెచ్ పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ వారిద్దరినీ స్వయంగా ఆహ్వానించారు. అయోధ్య రామమందిరం ఉద్యమానికి ఊపిరూలి..ఉప్పెనలా మార్చిన ఈ ఇద్దరు దిగ్గజ నేతలు రామమందిర కార్యక్రమానికి హాజరుకావడం లేదని సోమవారం రామమందిర ట్రస్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.

ఎల్ కె అద్వానీ 96ఏళ్లుగా ఉండగా జోషి 89 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకుని వారిద్దర్నీ రామాలయ ప్రారంభ కార్యక్రమానికి రావద్దని విజ్నప్తి చేశామని..మా వినతిని వారిద్దరూ అంగీకరించారని రామమందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వ్యక్తం అయ్ాయయి. కాగా ప్రస్తుత ఆహ్వానం నేపథ్యంలో వారిద్దరూ కూడా రామమందిర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారని సమాచారం. ఈ నేతలతోపాటు వీహెచ్ పీ రామజన్మభూమి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ చరిత్రలో రికార్డు…అత్యధిక ధరలకు అమ్ముడైన టాప్ 10 ప్లేయర్లు వీళ్లే..!!

Latest News

More Articles