Wednesday, May 8, 2024

సలార్ టికెట్ ధరలు పెంపు…తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్..!!

spot_img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందించిన తాజా చిత్రం సలార్ టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణ మల్టీప్లెక్స్ ల్లో రూ. 100, సింగిల్ థియేటర్లలో రూ. 65 పెంచుకునే విధంగా ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. ఏపీలో టికెట్ ధరను రూ. 40 చొప్పున పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అగ్రకథనాయకులు నటించిన చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ విషయంలో నిబంధనల మేరకు మొదటివారం టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. సలార్ ను తెలుగు రిలీజ్ చేయనున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విజ్నప్తి చేసాయి. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి డిసెంబర్ 28 వరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ వెసులుబాటును కల్పించింది. రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్థరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చింది. సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4గంటల నుంచి 6వ ఆట ప్రదర్శించుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల వరకే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మూవీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ చరిత్రలో తొలిసారి.. 141 మంది ఎంపీలు సస్పెండ్

Latest News

More Articles