Monday, May 13, 2024

హోటల్‎లో సెక్స్ రాకెట్ నడుపుతున్న హైదరాబాద్ పహిల్వాన్ అరెస్ట్

spot_img

స్పాలు, సెలూన్ల ముసుగులోనే కాకుండా హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఫార్చ్యూన్ హోటళ్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో నడుస్తున్నట్లు బయటపడింది. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా ఉంచి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఈ అమ్మాయిలందరినీ హోటల్లో పెట్టినట్లు గుర్తించారు. హోటళ్లో 25 రూములు తీసుకొని, వాటిలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది. అఖిలేష్‎ను అదుపులోకి తీసుకొని అతని పూర్వ ట్రాక్ రికార్డ్ పోలీసులు బయటికి తీశారు. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు పోలీసులు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులకు కూడా అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్‎లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: అయోధ్యకు చేరుకున్న శ్రీవారి లక్ష లడ్డులు

Latest News

More Articles