మహబూబ్ నగర్ జిల్లా: ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెసోళ్లు ఓట్లు అడుగుతున్నారని దేవరకద్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దేవరకద్ర మండలంలో బస్వయపల్లి, ఇస్రం పల్లి, డోకూర్ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. బస్వాయపల్లి గ్రామం నుండి బిటి రోడ్డు నిర్మించుకున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నట్లు పేర్కొన్నారు.
సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించుకున్నాం. గతంలో కాంగ్రెస్ వాళ్లు మన ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తున్నారు. ప్రజలంతా ఓట్ల రూపంలో వారికి తగిన బుద్ది చెప్పాలి. అమాయక ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేయాలన్నారు. అభివృద్ధి చేసినం కాబట్టే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం. అభివృద్ధి చేసిన కారుగుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు.