Sunday, April 28, 2024

సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థికి మజ్లిస్ పార్టీ నేతల మద్దతు

spot_img

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ కు సికింద్రాబాద్ నియోజకవర్గ మజ్లిస్ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. చిలకలగూడ, వారసిగూడ, మహమ్మద్ గూడా, లాలాగూడ ప్రాంతాలకు చెందిన  మజ్లిస్ పార్టీ నేతలు సికింద్రాబాద్ లోని ఆయన నివాసంలో  పద్మారావు గౌడ్ తో సమావేశమై ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సికింద్రాబాద్ లో ముస్లింల సంక్షేమానికి తాము కల్పించిన ప్రాముఖ్యతను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా వారికీ వివరించారు. వారికీ కృతఙ్ఞతలు తెలిపారు.

మెట్టుగూడ లోని సెయింట్ మార్క్స్ చర్చ్ లో జరిగిన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ను పాస్టర్ లు ఆశీర్వదించారు.  అనంతరం చర్చ్ వెలుపల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… సికింద్రాబాద్ లో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసినట్లు తెలిపారు. క్రైస్తవుల ప్రయోజనాల పరిరక్షణకు పాటు పడ్డానని, చర్చిలకు అండగా నిలిచానని తెలిపారు. సెయింట్ మార్క్స్ చర్చ్ పునర్నిర్మాణం లో పద్మారావు గౌడ్ కీలక పాత్ర నిర్వహించారని చర్చ్ పాలక మండలి ప్రతినిధి మోజెస్ ప్రశంశించారు.

Latest News

More Articles