Sunday, May 19, 2024

టీటీడీ భక్తులకు అలర్ట్…10గంటలకు మే నెల శ్రీవారి సేవా టికెట్లు విడుదల..!!

spot_img

టీటీడీ శ్రీవారి భక్తులకు అలర్ట్. నేడు ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10గంటల వరకు ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను ఈనెల 22న ఉదయం 10గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లు మధ్యాహ్నం 3గంటలకు అంగప్రదక్షిణ టోకెట్ల కోటాను 23న ఉదయం 10గంటలకు శ్రీవారి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను ఉదయం 11గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

వయో వృద్ధులు, దివ్యాంగులు,ఇతరులకు మే నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతోపాటు 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటల కు పరకామణి సేవా టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఆన్‌ లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

ఇది కూడా చదవండి: చపాతీ పిండి వారం రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!!

Latest News

More Articles