Sunday, May 19, 2024

ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు తప్పిన పెను ప్రమాదం.!!

spot_img

తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఎదురుగా వస్తున్న లారీ తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుతెలుస్తోంది. ఈ ఘటనలో లక్ష్మన్ తోపాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: శుభకార్యాలకు నల్లని దుస్తులు ఎందుకు ధరించకూడదో తెలుసా?

Latest News

More Articles