Friday, May 17, 2024

బీఆర్ఎస్‏లో చేరిన కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్

spot_img

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రోజురోజుకు ఈ చేరికలు ప్రభంజనంలా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

Read Also: 6 కాదు 60 గ్యారంటీలిచ్చినా కాంగ్రెస్ పార్టీని జనం నమ్మరు

తాజాగా బీజేపీకి చెందిన కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్‎లో చేరారు. హైదరాబాద్, బాగ్ అంబర్ పేటకు చెందిన బీజేపీ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పద్మా వెంకట్ రెడ్డి దంపతులు, పలువురు బీజేపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వేదికగా గులాబీ దళంలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయానికి తమ శాయశక్తులా పనిచేస్తామని పద్మా వెంకట్ రెడ్డి అన్నారు.

Read Also: వచ్చే ఎన్నికల్లో నాకు, కేసీఆర్‎కు హ్యాట్రిక్ ఇవ్వాలి

Latest News

More Articles