Sunday, May 19, 2024

ఒకే థియేటర్‎లో రూ. 3 కోట్లు వసూల్ చేసిన ‘యానిమల్’

spot_img

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ న‌టుడు రణ్‌బీర్‌ కపూర్ కాంబోలో వ‌చ్చిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం విడుద‌లైన రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ.870 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. ఇక ఈ ఏడాది విడుద‌లైన ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో యానిమ‌ల్ కూడా చోటు సంపాదించుకుంది.

Read Also: అలర్ట్.. రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్

ఇదిలావుంటే.. ఈ మూవీ తాజాగా అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీ కెనడా టొరంటోని సిల్వ‌ర్ సిటీ బ్రామప్టన్ అనే థియేట‌ర్‌లో ఏకంగా 5 లక్షల కెనడా డాలర్లు (రూ.3.15 కోట్లు) వసూళ్లు సాధించింది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క థియేట‌ర్‌లోనే ఇంత క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా యానిమల్ రికార్డు సృష్టించింది. సినిమా పట్ల ప్రేక్షకులకున్న ఆదరణ చూసి ఈ సినిమా ఓటీటీ వెర్ష‌న్‌కు మరో 20 నిమిషాలు జ‌త చేయ‌నున్న‌ట్లు డైరెక్టర్ సందీప్ ప్ర‌క‌టించాడు.

Latest News

More Articles