నల్గొండ జిల్లాలో విషాద ఘటన జరిగింది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వయసు 25 సంవత్సరాలలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Read Also: ఒకే థియేటర్లో రూ. 3 కోట్లు వసూల్ చేసిన ‘యానిమల్’