సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా.. రష్మిక కథానాయికగా నటించిన సినిమా ‘యానిమల్’. ఈ సినిమాలో తండ్రీ కొడుకులైన అనిల్ కపూర్ – రణ్బీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలతో ఎమోషనల్ టచ్తో సాగుతున్న నా ప్రాణం అనే లిరికల్ సాంగ్ను అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ట్విట్టర్లో ఓ నెటిజన్ ఈ పాటను తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లతో రీ క్రీయేట్ చేశాడు. ఈ పాటలో తండ్రీ కొడుకులైన కేసీఆర్, కేటీఆర్ల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. దీంతో ఈ వీడియో చూసి ఎమోషనల్ అయిన మంత్రి కేటీఆర్ ఈ పోస్టును రీట్వీట్ చేశారు లవ్ ఎమోజిని జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
— KTR (@KTRBRS) November 25, 2023