Friday, May 17, 2024

ఫూంచ్ లో ఉగ్ర‌దాడి.. ముగ్గురు జ‌వాన్లు మృతి

spot_img

జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌వాన్లు వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జ‌వాన్లు మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఫూంచ్ జిల్లాలోని బూఫ్లిజా ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో నిన్న రాత్రి నుంచి బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సావ్నీ ఏరియాలోని రాజౌరీ – థ‌న‌మండి – సూర‌న్‌కోటే ర‌హ‌దారిపై గురువారం మ‌ధ్యాహ్నం 3:45 గంట‌ల‌కు ఆర్మీ ట్ర‌క్కుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు.

Read also: రెజ్ల‌ర్ సాక్షీమాలిక్ కీలక నిర్ణయం.. ఏడుస్తూ ఆటకు గుడ్ బై

Latest News

More Articles