జయశంకర్ భూపాలపల్లి లో రేపు (బుధవారం) జరిగే సింగరేణి ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఇందుకోసం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 80 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 5,350 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి.
ఇది కూడా చదవండి: కరోనాతో హైదరాబాద్లో తొలి మరణం