Sunday, May 5, 2024

కరోనాతో హైదరాబాద్‎లో తొలి మరణం

spot_img

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్‎లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతో ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా.. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఊపిరితిత్తుల మీద కరోనా తీవ్ర ప్రభావం చూపడంతోనే ఆ రోగి మృతిచెందినట్టు ఆసుపత్రి సుపరిండెంట్ నాగేంద్ర పేర్కొన్నారు. కాగా.. కరోనా కారణంగా తెలంగాణలో ఈ ఏడాది నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో… దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు పీజీ డాక్టర్లు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది.

Read Also: ట్రాఫిక్‎ను తప్పించుకునేందుకు నదిలో డ్రైవింగ్ చేసిన వ్యక్తి

Latest News

More Articles