ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఇవాళ (మంగళవారం) ఘోర ప్రమాదం జరిగింది. మంగళ్వౌర్లోని లహబోలి గ్రామ సమీపంలోని మజ్రా మార్గ్ లో ఉన్న ఇటుక బట్టీ గోడ కింద ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా .. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కొత్వాలి మంగళూరు పరిధిలోని లహబోలి గ్రామంలో శాన్వి బ్రిక్స్ ఫీల్డ్ పేరుతో ఇటుక బట్టీ ఉంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడ ప్రమాదం జరిగింది. 8 మంది కూలీలు కలిసి కూర్చుని చేతులు శుభ్రం చేసుకుంటుండగా .. పక్కనే ఉన్న ఇటుక గోడ ఒక్కసారిగా కూలిపోయింది. కూలీలంతా అందులో సమాధి అయ్యారు. ఇటుకలు మోస్తున్న కొన్ని జంతువులు కూడా చనిపోయాయి. జేసీబీ సహాయంతో శిథిలాలు తొలగించి కార్మికులను బయటకు తీశారు. అప్పటికి 5 మంది చనిపోయారు. ఒకరు ఆసుపత్రిలో మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై కేసు నుమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో సన్బర్న్ కార్యక్రమం రద్దు