Friday, May 17, 2024

ప్రేమించట్లేదని యువతికి పురుగుల మందు తాగించిన ఇద్దరు పిల్లల తండ్రి

spot_img

తనను ప్రేమించడంలేదనే కోపంతో ఓ యువకుడు యువతికి పురుగుల మందు తాగించి హత్యచేశాడు. ఈ విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వినాయక చవితి రోజు జరిగింది. వెంకట్రావ్ పేటకు చెందిన బూడే దీప (19) ఇంటర్ తర్వాత చదువు మానేసి, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ కూలీ పనులు చేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్ (28) గత ఆరు నెలలుగా ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న కమలాకర్‎ను దీప దూరం పెట్టింది. అయినా కూడా వినకుండా.. ఆమెను వేధించేవాడు. ఎవరితోనైనా మాట్లాడితే.. ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. దాంతో దీప భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.

Read Also: టీ20లో అత్యంత చెత్త రికార్డ్.. 15 పరుగులకే ఆలౌట్

కాగా.. దీప మీద కోపం పెంచుకున్న కమలాకర్.. ఈ నెల 17న సాయంత్రం దీప ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెతో ప్రేమించాలంటూ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి.. తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కమలాకర్ పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బా తీసుకొని.. దీప నోట్లో బలవంతంగా పోశాడు. అనంతరం భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీప వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చి.. కాపాడాలంటూ చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. వెంటనే వారు సిర్పూర్ (టీ) ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి కరీంనగర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దీప మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. దీప కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కమలాకర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles