చైనా మొబైల్ దిగ్గజం ‘వన్ప్లస్’ కంపెనీ గత జులైలో ‘నార్డ్ 3 5జీ’ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. అద్భుతమైన కెమెరా, పెద్ద డిస్ప్లే, సూపర్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దాంతో నార్డ్ 3 5జీ అమ్మకాలు భారీగా జరిగాయి. ఫోన్ విడుదలైన సమయంలో ‘నాట్ అవాలబుల్’ అని దర్శనమిచ్చేది. అంతటి డిమాండ్ ఉన్న ఈ స్మార్ట్ఫోన్ మీద అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. ఈ వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ని కేవలం పది వేలకే కొనుగోలు చేయొచ్చు.
ఇది కూడా చదవండి: 66 కిలోల బంగారంతో గణపతికి అలంకారం
ఈ ఫోన్ కొనుగోలుతో పాటు రూ.2,199 విలువైన నార్డ్ బడ్స్ 2ఆర్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు వన్ప్లస్ ప్రకటించింది. అయితే అమెజాన్, అధికారిక వన్ప్లస్ స్టోర్ నుంచి ఫోన్ను కొనుగోలు చేసినవారికి మాత్రమే ఈ బడ్స్ ఉచితంగా ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ బడ్స్ బ్యాటరీ లైఫ్ 40 గంటలు ఉండనుంది.
ఇది కూడా చదవండి: ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. తిరుమల ప్రయాణికులకు శుభవార్త
వన్ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ ప్రస్తుతం భారత్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB + 128GB ధర రూ.33,999 కాగా.. 16GB + 256GB ధర 37,999గా ఉంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్13తో వస్తోంది. 120Hz రీఫ్రెస్ రేట్ ఉన్న 6.74 అమోలెడ్ డిస్ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉంటాయి. 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ లభించనుంది.