Monday, May 20, 2024

66 కిలోల బంగారంతో గణపతికి అలంకారం.. రూ.360 కోట్ల ఇన్సూరెన్స్

spot_img

ముంబయి: దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ ‘మహాగణపతి’ ఈ ఏడాదీ వార్తల్లో నిలిచింది. ఇక్కడి విఘ్నేశ్వరుడి విగ్రహానికి ఏకంగా 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో అలంకరణ చేశారు.

Also Read.. తెలంగాణ సమాజం ‘కేసీఆర్’ను తప్ప ఎవరిని కోరుకోవడం లేదు

భక్తులు, నిర్వాహకులకు వర్తించేలా రికార్డు స్థాయిలో రూ.360.40 కోట్లకు బీమా చేయించినట్లు జీఎస్‌బీ సేవామండల్‌ నిర్వాహకులు తెలిపారు. ఇదే కాకుండా మండపం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొదటిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేసారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles