న్యూఢిల్లీ: ఎల్ఐసీ ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే రీ అపాయింట్ అయిన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్ పొందేందుకు అర్హత కల్పించారు.
Also Read.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు..షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు..!!
ఎల్ఐసీ ఏజెంట్లకు టర్మ్ ఇన్సురెన్స్ కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ.3,000-10వేలు స్థాయి నుంచి రూ.25,000-1.50 లక్షల స్థాయికి పెంచారు. ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాలకు 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ కింద అందివ్వనున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఏజెంట్లకు, లక్షకు పైగా రెగ్యులర్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.