హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు చేతలకు పొంతన ఉండదు.. కర్ణాటక లో అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదు వందల కోట్ల స్కామ్ లు బయట పడుతున్నాయని ఎమ్మెల్యే గువ్వల బాల రాజు , ఎమ్మెల్సీ భాను ప్రసాద్ లు అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్ గ్రెస్ పార్టీ అని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మరోసారి వంద సీట్లు గెలవబోతున్నట్లు తెలిపారు.
Also Read.. కేరళలో తగ్గుముఖం పడుతున్న నిపా కేసులు
తెలంగాణ సమాజం కేసీఆర్ ను తప్ప ఎవరిని కోరుకోవడం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు ఆదరణ ఎందుకు లేదు. రేవంత్ అప్పుడు సోనియా ను బలి దేవత అన్నాడు. ఇప్పుడేమో దేవత అంటున్నాడు. ఓటుకు నోటులో దొరికిన దొంగ రేవంత్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో ఉన్న అభివృద్ధి ఏందో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.