చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలో ఐదంతస్తుల బిల్డింగ్ లో ఓ ప్రైవేటు బొగ్గు గని సంస్థ కార్యాలయం ఉంది. ఆ ఆఫీసులో ఇవాళ(గురువారం) మంటలు చెలరేగాయి. రెండవ అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది చనిపోయారు. దాదాపు 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు తెలిపారు అధికారులు.
ఇది కూడా చదవండి: టీ చేస్తుండగా సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు