Saturday, May 18, 2024

పెళ్లాం మీద కోపంతో బార్‎లో కాల్పులు.. ఐదుగురు మృతి

spot_img

పెళ్లాం మీద కోపంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియా, ఆరెంజ్‌ కౌంటీలోని కుక్స్ కార్నర్ బైకర్స్‌ బార్‌ వద్ద దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. నిందితుడిని రిటైర్డ్‌ పోలీసు అధికారిగా గుర్తించారు. భార్య తనను దూరంగా పెడుతుండటంతో.. బార్‎లో ఉన్న ఆమెను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు.

కాల్పుల శబ్దం విన్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడకు చేరుకొని.. ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు కూడా చనిపోయాడు.

Latest News

More Articles