Saturday, May 4, 2024

రేవంత్ రెడ్డికి షాక్.. కారెక్కిన బాలకిషన్ యాదవ్

spot_img

కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాలకిషన్ యాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నరు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ బాలకిషన్ యాదవ్ కు గులాబీ కండువ కప్పి స్వాగతం పలికారు.

Also Read… ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కొడంగల్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అయితే సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి కొడంగల్ లో ప్రజల కోసం ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తపిస్తున్న వైనం చూసి తన నామినేషన్ ఉపసంహరించుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. దుద్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన రోజు బాలకృష్ణ యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరడం గమనార్హం.

Latest News

More Articles