Tuesday, May 7, 2024

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యం

spot_img

హైదరాబాద్: పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేట డివిజన్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయన్నారు.

Also Read.. అమెజాన్‌ అలెక్సా యూనిట్‌లో వందలమంది ఉద్యోగుల తొలగింపు

పేదల కష్టాలు తెలిసిన పెద్ద మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా ఇచ్చారు. నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందిస్తున్నాం. పేద, మధ్య తరగతి ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యం అని పేర్కొన్నారు.

Latest News

More Articles