Monday, May 20, 2024

బీఆర్ఎస్ వెంటే బంజారాలు

spot_img

పోతంగల్ మండలం జల్లాపల్లి అబాదిలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ మాత- సేవాలాల్ మహారాజ్ మందిరాలు, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ’’నియోజకవర్గంలోని ప్రతి తాండాలో జగదాంబ మాత -సేవాలాల్ మహారాజ్ ల దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతనే గ్రామాలు‌, తాండాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు వస్తున్నాయి.

బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 500 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ఇచ్చారు. వీటితో గ్రామాలు, తాండాలలో సామాజిక అవసరాల కోసం కావలసిన నిధులను మంజూరు చేశాను. ఇక మొదటి నుండి మా కుటుంబానికి బంజారాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  రాజకీయంగా బంజారాలు ఎప్పుడూ బీఆర్ఎస్ వెంటే ఉంటున్నారు. బంజారాల పిల్లల చదువుకోవడానికి నస్రుల్లాబాద్ లో ST బాలుర రెసిడెన్షియల్ ఏర్పాటు చేయించి రూ. 13 కోట్లతో భవనాలు నిర్మించాం. అదేవిధంగా కోనాపూర్-హన్మాజీపేట వద్ద గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం, రూ. 12 కోట్లతో భవనాలను నిర్మిస్తున్నాం. బాన్సువాడ నియోజకవర్గంలో 36 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం‘‘ అని అన్నారు.

Latest News

More Articles