Saturday, May 18, 2024

బీసీ గురుకుల డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

spot_img

2023-24 అకాడమిక్ ఇయర్ కోసం మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ డిగ్రీ కాలేజీలో  ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. బీసీలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త గా డిగ్రీ కాలేజీలను గత విద్యా సంవత్సరం ఏర్పాటు చేశారన్నారు మంత్రి గంగుల. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు https://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్లో చూసుకోవచ్చని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 డిగ్రీ కాలేజీలో సీట్లను ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పారు.

Latest News

More Articles