ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో గ్యాంగ్ వార్ కలకలం రేగింది. ఇవాళ(బుధవారం) సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్స్ డ్రెస్సుల్లో వచ్చిన కొందరు దుండగులు ఓ గ్యాంగ్స్టర్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్స్టర్ చనిపోగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపింది ముక్తార్ అన్సారి అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.