విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాజాగా మరో 12 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబరబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న రాజేంద్ర నగర్ జోన్ లో నూతనంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు.
DCP జగదీశ్వర్ రెడ్డి, Asst DCP రేష్మా పెరుమాళ్, ACP గంగాధర్ గార్లతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రాభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి SHO యాదగిరి గారిని నియమించటం మంచి నిర్ణయమని.. సైబరాబాద్ పరిధిలో సమర్ధవంతమైన పోలీస్ అధికారులలో యాదగిరి ఒకరని కొనియాడారు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.