Friday, May 17, 2024

బెంగాల్‌ మాజీ గవర్నర్‌ కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూత

spot_img

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.

త్రిపాఠి రెండుసార్లు కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS)లో సుదీర్ఘ చికిత్స తర్వాత కోలుకున్నారు. అలహాబాద్‌లో నవంబర్ 10, 1934న జన్మించిన కేశరీ నాథ్ త్రిపాఠి.. బీహార్, మేఘాలయ మరియు మిజోరాం గవర్నర్‌గా కూడా కొంతకాలం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

Latest News

More Articles