Friday, May 17, 2024

న్యూఇయర్ రోజు ఫోటోలు దిగనీయలేదని యువతి సూసైడ్

spot_img

షాపింగ్‌ మాల్‌లో ఫొటోషూట్‌కు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకొంది. సుధామనగర్‌కు చెందిన వర్షిణి (21) ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం బీబీఏ చదువుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మాల్‌లో ఫొటోషూట్‌ చేయాలనుకొంది. ఇందుకు తల్లిదండ్రులను అనుమతి కోరగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఇంట్లోని తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మరుసటి రోజు గదిలో నుంచి తమ కూతురు బయటకు రాకపోవడంతో.. వెళ్లి  చూడగా కూతురు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read Also: విద్యార్థులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చిన బ్రిటన్

Latest News

More Articles