Friday, May 3, 2024

వైఎస్ షర్మిలకు బిగ్ షాక్..సొంతగూటికి చేరిన ఆర్కే..!!

spot_img

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గట్టి షాకిచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో విభేదిం వైసీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్ తో భేటీ కానున్నారు. ఆయనకు మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపార్టీకి పునర్ వైభవం కోసం ప్రయత్నిస్తున్న పీసీసీ చీఫ్ షర్మిలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్కే కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే.

ఆర్కే పార్టీలో చేరిన రోజే కీలక సమావేశం జరిగింది. ఆ భేటీకి ఆర్కేను ఆహ్వానించలేదు. కనీసం లోపలికి అయినా పిలుస్తారని చాలా సమయం గేటు వద్ద వేచి ఉన్నారు. అయిన కూడా సమావేశానికి పిలువకపోవడంతో కోపంతో అక్కడి నుంచి వెనుదిగినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పై ఆయన కోపంగా ఉన్నట్లు గ్రహించిన విజయసాయి రెడ్డి మంతనాలు జరిపిరాని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి వచ్చేందుకు ఆర్కే కూడా మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: త్వరలోనే కార్తీకదీపం- 2…డాక్టర్ బాబు, వంటలక్క కూడా ఉన్నారా?

Latest News

More Articles