Friday, May 17, 2024

రాజేష్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

spot_img

హైదరాబాద్: రాజేష్ మృతి కేసును ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. రాజేష్ పోస్టు మార్టం రీపోర్ట్ లో ఎలాంటి గాయాలు లేవని నిర్ధారణ అయిందన్నారు. రాజేష్, సుజాత కు సంబంధం ఉందని ఆధారాలు సేకరించామని, సుజాత కొడుకు జయ్ చంద్రకు విషయం తెలిసిందని, దీంతో రాజేష్ ను కొట్టాడని వివరించారు.

సుజాత మొదట పురుగుల మందు తాగిందని, తన తల్లి చావు బతుకుల మధ్య ఉందని రాజేష్ కు చెప్పింది జయ్ చంద్ర అని, దాంతో రాజేష్ కూడా చావాలని అనుకున్నాడని తెలిపారు. అయితే, ఒకే రోజు ఇద్దరు పురుగుల మందు  తాగలేదని స్పష్టం చేశారు. మొదట సుజాత పురుగుల మందు తాగిందన్నారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని కమిషనర్ చౌహాన్ వెల్లడించారు.

Latest News

More Articles