Tuesday, May 21, 2024

ఆర్టీసీ బస్సుపై ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల దాడి

spot_img

యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేతగా నిలిచాడు. దీంతో బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా కామన్‌మెన్‌ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ప్రశాంత్‌ విజేత అని ప్రకటించగానే సంబురాలు చేసుకున్నారు. అయితే ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు.

దీంతోపాటు హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్‌దీప్‌ కారును చుట్టుముట్టి.. దాడిచేశారు. కారు అద్దాలు పగలగొట్టి బయటకు దిగాలంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, ఆయన భార్య భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదుచేశారు.

Latest News

More Articles