Saturday, May 18, 2024

బీహార్ కాలేజీ హెచ్చరిక: ఆడ, మగ విద్యార్థులు కలసి కూర్చోవద్దు

spot_img

బీహార్ లోని సివాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్  జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే దగ్గర కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే బహిష్కరిస్తామని హెచ్చరించింది. బీహార్ లో ఇలాంటి ఆదేశాల జారీ ఇదే మొదటిది. దీంతో మహిళా కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాలేజీ గవర్నింగ్ బాడీ సెక్రటరీ, ప్రిన్సిపల్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు..మహిళ, పురుష విద్యార్థులు కలసి పక్కపక్కన కూర్చున్నా, లేక సన్నిహితంగా మాట్లాడుకుంటున్నా కళాశాల విద్యార్థుల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామన్నారు.

ఇటీవలే కాలేజీలో ఇద్దరు మహిళా విద్యార్థినులు ఒకే బోయ్ ఫ్రెండ్ కోసం గొడవ పడగా, అది పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటివి అరికట్టే ఉద్దేశ్యంతోనే తాజా ఆదేశాలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మహిళా హక్కుల కార్యకర్తలు మాత్రం ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అందరి బాగు కోరే కేసీఆర్‌ను మరో సారి ఆశీర్వదించండి

Latest News

More Articles