Friday, May 17, 2024

రీల్స్ చేయొద్దన్న భర్తను చంపేసిన భార్య

spot_img

ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏవేవో చేస్తున్నారు. కొత్తకొత్త ప్రదేశాలు, డ్యాన్సులు, కొన్ని సీన్లు చేసి పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం గుర్తింపు కోసం దిగజారుతున్నారు. అలా రీల్స్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తుందని, రీల్స్ చేయొద్దని చెప్పిన భర్తను అంతమొందించింది ఓ భార్య. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వద్దన్నందుకు ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేసింది. అక్కాచెల్లెళ్ల సాయం తీసుకొని భర్త గొంతుకోసి చంపేసింది. ఈ దారుణ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగింది.

Read Also: హైబీపీతో భర్త మృతి.. తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న భార్య

మహేశ్వర్‌ కుమార్‌ రాయ్‌ (25), రాణి కుమారి ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరికీ 7 ఏండ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. దినసరి కూలీగా పనిచేసే రాయ్ కొంతకాలం కోల్‌కతాలో కాపురం పెట్టాడు. అక్కడే చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే రాయ్ భార్య రాణి ఎప్పటినుంచో భార్య సోషల్‌ మీడియా రీల్స్‌ చేస్తుండేది. ఈ క్రమంలోనే ఓ యువకుడితో అక్రమసంబంధం కూడా పెట్టుకుంది. అది తెలిసిన రాయ్.. చాలాసార్లు రీల్స్ చేయవద్దని చెప్పాడు. రాణిలో మార్పు రాకపోవడంతో కుటుంబంతో సహా సొంతూరికి వచ్చాడు. స్వగ్రామానికి వచ్చాక కూడా రాణి రీల్స్ చేస్తుండటంతో వద్దని వారించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో రాణి పుట్టింటికి వెళ్లింది. గత ఆదివారం భర్తను తన పుట్టింటికి రావాలని కోరింది. అక్కడకు వెళ్లిన రాయ్ ను తన మాజీ ప్రేమికుడు, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి గొంతునులిమి చంపేసింది. అనంతరం మెడకు ఉరితాడు బిగించి, ఆత్మహత్య చేసుకున్నాడని అందరికీ చెప్పింది. ఇదంతా నమ్మని రాయ్ తండ్రి.. తన కోడలి మీదే అనుమానం ఉందని పోలీసులకు తెలిపాడు. దాంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు నమ్మలేని విషయాలు తెలిశాయి. తనకు రీల్స్ చేయడం ఇష్టమని, కానీ తన భర్త మాత్రం అందుకు అంగీకరించేవాడు కాదని, ఆ కోపంతోనే అతన్ని చంపేసినట్లు రాణి ఒప్పుకుంది. దాంతో పోలీసులు రాణితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు చెల్లెళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Latest News

More Articles