బ్రిటన్లోని రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. వేతన చెల్లింపులకు సంబంధించి నిధులలేమి కారణంగా సుమారు 650-750 బ్రిటిష్ పౌండ్ల స్టెర్లింగ్ చెల్లింపులు నిలిచిపోయినట్టు బర్మింగ్హామ్ కౌన్సిల్ నేత జాన్ కాటన్, ఉప నేత శరోన్ థాంప్సన్ ప్రకటించారు.
Read Also.. కూకట్ పల్లి అడ్డగుట్టలో విషాదం.. ముగ్గురు కూలీలు మృతి
నిధుల లేమి కారణంగా అత్యవసరం కాని అన్ని సేవల ఖర్చులను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఆర్థి సంక్షోభం నేపథ్యంలో వేతన చెల్లింపుల బాధ్యతల నుంచి కూడా కౌన్సిల్ తప్పుకొన్నదని పేర్కొన్నారు. యూకే సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2012 నుంచి పెండింగ్ లో ఉన్న చెల్లింపుల కింద 1.1 బిలియన్ పౌండ్లను బర్మింగ్హామ్ కౌన్సిల్ చెల్లించింది.