Friday, May 3, 2024

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో బీజేపీ నేత కుమారుడు

spot_img

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.. తాజాగా హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో బీజేపీ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు… డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి ఆ నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాలుగో టెస్టులో టీమిండియా విజయం.. 3-1తో సిరీస్‌ కైవసం

Latest News

More Articles