రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్లతో విజయాన్నిసాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఓ దశలో టీమిండియా 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయంగా 72 పరుగులు జోడించి టీమిండియా విజయాన్ని అందించారు. గిల్ 52, జురెల్ 39 పరుగులతో నాటౌట్గా ఉన్నారు.
మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా, టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ను రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు 145 పరుగులకు కుప్పకూల్చారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తాచాటారు. కాగా రెండు జట్ల మధ్య నామమాత్రమైన చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
ఇది కూడా చదవండి: పదో తరగతి విద్యార్థులకు కేటీఆర్ చిరు కానుక