Monday, May 20, 2024

పదో తరగతి విద్యార్థులకు కేటీఆర్ చిరు కానుక

spot_img

పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాబోయే విద్యార్థుల‌కు కేటీఆర్ చిరు కానుక అందించారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గం రాజ‌న్న సిరిసిల్ల‌కు చెందిన ఓ 3 వేల మంది విద్యార్థుల‌కు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల‌ను అంద‌జేశారు. వారంద‌రికీ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విష‌యాన్ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశారు. ఇచ్చింది చిన్న కానుకే కానీ.. ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్న్నారు.

గ‌తేడాది మార్చి నెల‌లో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుతున్న‌ 2 వేల మంది విద్యార్థుల‌కు కేటీఆర్ డిజిటల్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

 

Latest News

More Articles