Saturday, May 18, 2024

ఏప్రిల్ మొదటి వారంలో.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు

spot_img

వచ్చే లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల బీజేపీలో చేరగా వారిని స్వాగతించిన అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలను కోరారు. బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, ‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు’ అని అన్నారు.

17 కోట్ల మంది సభ్యులతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని కిషన్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం వంటి కేసుల్లో కేంద్ర మంత్రులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించాడు కాంగ్రెస్ దెగ్గర సరైన ప్రణాళికనే లేదని.. ఆ దిశగా కనీసం అడుగులు వేయటం లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే మూసీ నదిలో ఓట్లు వేసినట్లేనని అన్నారు.

Latest News

More Articles