Monday, May 20, 2024

నిజమవుతున్న ఉద్యమ నినాదాలు

spot_img

తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజం అవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాక్టుల నిర్మాణం పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శవంతమైన అనేక సంక్షేమ పథకాలు తెలంగాణాలో ప్రవేశ పెడితే ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ పథకాలు అనుసరిస్తుందన్నారు. నీళ్లు, నిధులు నినాదాలు ఇప్పటికే నిజమయ్యాయని పేర్కొన్నారు.

ఇప్పటికే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరిన్ని నియామకాల కోసం నోటిఫికేషన్ లు జారీ చేసిందన్నారు. ఇటీవలే విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో వేలాది మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. తెలంగాణ రాక ముందు ఎట్ల ఉండే.. తెలంగాణ వచ్చినాక ముస్తాబాద్ ఎట్ల అభివృద్ధి చెందిందో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,
రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్‌ గూడూరి ప్రవీణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,
రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావు,జెట్పీటీసీ నర్సయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గోపాల్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

More Articles