Friday, May 17, 2024

కేంద్ర హోం శాఖ సమావేశానికి వినోద్ కుమార్  

spot_img

హైదరాబాద్: మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో జరుగనున్న అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరుకానున్నారు.

ఈ మేరకు బీ.ఆర్.ఎస్. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు వినోద్ కుమార్ బీ.ఆర్.ఎస్. తరఫున న్యూఢిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేశంలో తన వంతు పాత్ర పోషించనున్నారు.

Latest News

More Articles