ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన జరగనుంది.తెలంగాణ సాహిత్యాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు.
ఇవాళ(శనివారం)సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్ఞాన తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో పుస్తక ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పుస్తక ప్రదర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జూలూరి గౌరీశంకర్ .
ఇది కూడా చదవండి: రెండు నెలల కాంగ్రెస్ పాలనలో రూ. 14వేల కోట్లు అప్పులా