Thursday, May 9, 2024

భారత్‌ వివరణ కోరిన మాల్దీవులు!

spot_img

భారత్‌ – మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా మాల్దీవులకు చెందిన ఫిషింగ్‌ బోట్లను భారత్‌ బలగాలు అడ్డుకున్నాయని ఆరోపించింది. సమగ్ర వివరాలు సమర్పించాలని భారత ప్రభుత్వాన్ని ఆ దేశ విదేశాంగశాఖ కోరింది. ఈ మేరకు అధికారికంగా లేఖ రాసింది. దీనిపై భారత్‌ స్పందించలేదు. జనవరి 31న ప్రత్యేక వాణిజ్య జోన్‌ (ఈఈజెడ్‌)లో మాల్దీవులకు చెందిన మూడు ఫిషింగ్‌ బోట్లను ఇండియన్‌ కోస్టు గార్డు అడ్డగించినట్లు, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను ఉల్లంఘించి ఎందుకు అడ్డగించాల్సి వచ్చిందో తెలియజేయాలని లేఖలో కోరింది.

Also Read.. రెండు నెల‌ల కాంగ్రెస్ పాలనలో రూ. 14వేల కోట్లు అప్పులా

Latest News

More Articles