Sunday, May 19, 2024

మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట !

spot_img

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఇక దీంతో అనుష్క శర్మ ప్రెగ్నన్సీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, కోహ్లికి మంచి స్నేహితుడైన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. విరుష్క దంపతులు ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఏబీడీ తెలిపాడు.

విరాట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వమని ఓ అభిమాని డివిలియర్స్ అడగగా.. తన యూట్యూబ్ ఛానెల్‌లో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సంవత్సరం తమ రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు కోహ్లీ, అనుష్క రెడీగా ఉన్నారు.. నేను ఎక్కువ సమాచారం ఇవ్వలేను కానీ ప్రస్తుతం విరాట్ తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. ఇది అతనికి ఎంతో ముఖ్యమైన సమయం.. ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యేందుకు అదే కారణమన్నాడు.’’ అయితే ఈ విషయంపై విరుష్క జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇది కూడా చదవండి: రెండు నెల‌ల కాంగ్రెస్ పాలనలో రూ. 14వేల కోట్లు అప్పులా

Latest News

More Articles