హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య రవీంద్ర నాయక్, ఎంఎల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్ రెడ్డి, తదితర పార్టీ నేతలు కేసీఆర్ ను కలిశారు. సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ తాము రచించిన పుస్తకాలను కేసీఆర్ కు అందజేశారు. అదే విధంగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు.. కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.
బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారిని పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ గువ్వల బాలరాజు,… pic.twitter.com/S6Oxza0E0m
— BRS Party (@BRSparty) February 3, 2024