Saturday, May 18, 2024

ఆమె మాటలు వింటుంటే నాకు జాలేస్తుంది..బొత్స కామెంట్స్ ..!!

spot_img

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. షర్మిల మాటలు వింటుంటే జాలిగా ఉందన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల కొత్తగా ఏదైనా మాట్లాడితే బాగుంటుందన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతుంటే అందులో కొత్త దనం ఏమీ లేదన్నారు. ప్రత్యేక హోదా ఎవరు తాకట్టు పెట్టారని..ప్యాకేజీ ఎవరు అడిగారని, ప్యాకేజీ చాలని ఎవరు రాసిచ్చారనేది నాటి సీఎం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే..!!

షర్మిల ఆ విషయాలు మర్చిపోయి సర్కార్, సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అన్నారు. కేంద్రం దగ్గర వైసీపీ సర్కార్ సాగిలపడలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్భావన విధానంతో వెళ్తున్నామన్నారు. ఎవరి రాజకీయ విధానం వారికి ఉంటుందన్న బొత్స రాష్ట్రంలో మూడు ప్రాంతాలు డెవలప్ చెందాలన్నది తమ విధానం అన్నారు. అమరావతి మాత్రమే రాజధాని కావాలన్నది బీజేపీ విధానమన్నారు. మరో 70రోజులు ఆగితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తుందని బొత్స అన్నారు.

Latest News

More Articles