Friday, May 3, 2024

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కు క్యాన్సర్..!

spot_img

వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్‌టన్‌ తనకు క్యాన్సర్‌ ఉందని షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. తనకు క్యాన్సర్ ఉందని, కీమోథెరపీ చేయించుకుంటున్నానని తెలిపారు. శుక్రవారం ప్రసారమైన ఓ వీడియో ఆమె ఆరోగ్యాన్ని వెల్లడించింది. కొన్ని వారాలుగా ఆమె ఆచూకీ, ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు జరుగుతున్న సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది. ఆమె కడుపు శస్త్రచికిత్స కోసం జనవరిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఈ శస్త్రచికిత్స గురించి స్పష్టమైన వివరాలు బయటకు రాలేదు. తెలియని రకం క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పుడు తన గోప్యతను గౌరవించాలని కేట్ ప్రజలకు పిలుపునిచ్చారు కేట్ మిడిల్టన్.కేట్ అస్వస్థత వార్త తెలియగానే, ఆమె భర్త, తమ్ముడు ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేట్ వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన సందేశంలో పేర్కొన్నాడు.

అయితే కేట్ మిడిల్టన్ గత డిసెంబర్ నుంచి కనిపించకుండ పోయింది. కేట్ కోమాలోకి వెళ్లి ఉండొచ్చని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. అయితే కేట్ మిడిల్టన్ కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరి 17న తెలిపింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని పేర్కొంది. అప్పటి నుంచి యువరాణి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం వదంతులకు కారణమైంది. తాజాగా కేట్ మిడిల్టన్ క్యాన్సర్ సోకిందన్న వార్త కలకలం రేపుతోంది.

ఇదిలా ఉంటే బ్రిటన్ రాజు చార్లెస్ 3కి క్యాన్సర్ నిర్దారణ అయ్యిందని బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్ యువరాణికి చికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు కూడా చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రష్యాలో ఉగ్రఘాతుకం..70 మంది దుర్మరణం.!

Latest News

More Articles