అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బావ బామమరిది మృతిచెందారు. హకీంపేట్ ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని బైకుతో ఢీకొట్టడంతో పండరి నరేందర్ (33), కొమ్ము నరసింహ (32) అనే బావ బావమరుదులు మృతి చెందారు. బైకు నడుపుతున్న నరసింహ అక్కడికక్కడే మృతిచెందగా.. నరేందర్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని అల్వాల్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: సికింద్రాబాద్లో రన్నింగ్ కారులో మంటలు.. పూర్తిగా దగ్దం